బిజెపిలో జనసేన విలీనమా.?
రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎంతో కొంత బలం పుంజుకోవాలంటే.. మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి, మాజీ మంత్రి కాపు రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు ముద్రగడ పద్మనాభంను బిజెపిలో చేర్చుకుని జనసేనను కూడా బిజెపిలో విలీనం చేసుకున్నట్లయితే.. బలమైన రాజకీయ శక్తిగా అవతరించవచ్చని.. బిజెపి అధ్యక్షడు సోము వీర్రాజు ఆశపడుతున్నారట. సిఎం జగన్కు రెడ్డి సామాజికవర్గ ఓటర్ల మద్దతు ఉంది. ఆసామాజికవర్గ ఓటర్లు కేవలం 4 నుండి 5శాతం లోపే ఉంటారు. చంద్రబాబుకు కమ్మ సామాజికవర్గ ఓటర్ల మద్దతు ఉంది.. ఆ సామాజికవర్గ ఓటర్లు కూడా కేవలం 4 నుండి 5శాతంలోపే ఉంటారు. రాష్ట్రంలో 22శాతం కాపు సామాజికవర్గ ఓటర్లు ఉన్నారు. అయినప్పటికీ.. రాజకీయ అధికారం రావటం లేదు. ఈ సారి ఎన్నికలలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, ముద్రగడ పద్మనాభంతో పాటు ఇతర స్థానిక బలమైన కాపు నాయకులను పార్టీలో చేర్చుకుంటే.. ఆ ప్రభావం ఓటర్లలో పనిచేసి రాజకీయ శక్తిగా ఎదగవచ్చనని… సోము వీర్రాజు ఆశపడుతున్నారు. మూడు రాజధానులకు మద్దతిచ్చిన చిరంజీవి, అమరావతి రాజధానికి మద్దతిస్తున్న జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ను, కాపునాయకుడు ముద్రగడ పద్మనాభాన్ని ఒక పార్టీలో చేర్చటం సోముకు సాధ్యపడుతుందా…? రాష్ట్ర